బాలుడా! భీముడా!!

తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా కేంద్రం ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం ఓ మహిళ...

Updated : 24 Jun 2020 07:37 IST

తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా కేంద్రం ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం ఓ మహిళ 5.5 కిలోల బరువు కలిగిన మగశిశువుకు జన్మనిచ్చారు. సోన్‌ మండలం లెఫ్ట్‌పోచంపాడ్‌కు చెందిన నేహా ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చారు. సాధారణ కాన్పునకు వీలుకాకపోవడంతో వైద్యులు రాజేందర్‌, సరోజ, మమత శస్త్రచికిత్స చేశారు. 5.5 కిలోల బరువుతో పండంటి మగబిడ్డ పుట్టాడు. పసికందు ఇంత బరువుతో జన్మించటం అరుదని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, నిర్మల్‌ గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు