ఆ వాహనాలపై 3 రోజుల్లో నిర్ణయం తీసుకోండి

అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్‌ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టులో విచారణ ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విచారణకు

Published : 24 Jun 2020 13:59 IST

ఏపీ హైకోర్టు ఆదేశం

అమరావతి: అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్‌ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టులో విచారణ ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విచారణకు హాజరయ్యారు. అక్రమ మద్యం కేసు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘కొంతమంది ఎస్‌హెచ్‌వోల పనితీరు బాగాలేదు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏజీకి ఆదేశిస్తే... ఏజీపీతో మెమో ఫైల్‌ చేయించారు. వాహనాలను మూడు రోజుల్లోగా ఎస్‌హెచ్‌వోలు డిప్యూటీ ఎక్సైజ్‌ కమిషనర్ ‌(డీఈసీ) ముందు ప్రవేశపెట్టాలి. వాహనదారులు వెంటనే డీఈసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. సీజ్‌ చేసిన వాహనాలపై మూడ్రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి’’ అని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని