పది వేలు దాటిన ఏపీ కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. గత 24 గంటల్లో 497 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 10,331కి పెరిగింది...
గత 24 గంటల్లో 497 కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. గత 24 గంటల్లో 497 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 10,331కి పెరిగింది. ఈ రోజు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 448 మందికాగా, ఇతర రాష్ట్రాల వారు 37 మంది, ఇతర ప్రాంతాల వారు 12 మంది. మొత్తం కేసుల్లో 8,306 మంది ఏపీకి చెందినవారు, 1,661 మంది ఇతర రాష్ట్రాలవారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారు 364 మంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 5,423 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 4,779 మంది నయమై డిశ్ఛార్జి అయ్యరు. ఈ రోజు కర్నూలులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు మృతి చెందారు. మొత్తంగా 129 మంది కరోనాతో చనిపోయారు. గత 24 గంటల్లో ప్రభుత్వం 36,047 శాంపిల్స్ పరీక్షించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.