ఇస్లామాబాద్లో హిందూ దేవాలయ నిర్మాణం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో మొట్టమొదటి హిందూ దేవాలయ నిర్మాణ పనులు మంగళవారం మొదలయ్యాయి. రూ.10 కోట్ల వ్యయంతో..
పనులు ప్రారంభించిన పాక్ ప్రభుత్వం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో మొట్టమొదటి హిందూ దేవాలయ నిర్మాణ పనులు మంగళవారం మొదలయ్యాయి. రూ.10 కోట్ల వ్యయంతో పాక్ ప్రభుత్వం శ్రీ కృష్ణుడి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది. 20 వేల చదరపు అడుగుల్లో ఈ గుడి నిర్మితమవుతోంది. మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హి ఆలయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇస్లామాబాద్తోపాటు నగర పరిసర ప్రాంతాల్లో 1947కి పూర్వం పలు హిందూ ఆలయాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అవి లేవు. గత రెండు దశాబ్దాలుగా రాజధానిలో హిందువుల జనాభా గణనీయంగా పెరిగింది. దీంతో వారికోసం దేవాలయాలయాలను నిర్మించనున్నాం’ అని తెలిపారు.
ఈ దేవాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మత వ్యవహారాల శాఖ మంత్రి పీర్ నూరుల్ హక్ ఖాద్రి స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణానికి ప్రత్యేక మంజూరుపై ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ చర్చించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఆలయానికి ఇస్లామాబాద్లోని హిందూ పంచాయతీ ‘శ్రీ కృష్ణ మందిర్’ అని నామకరణం కూడా చేసింది. క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ) ఈ గుడికి సంబంధించిన స్థలాన్ని 2017లోనే హిందూ పంచాయతీకి కేటాయించింది. కానీ, సీడీఏ, ఇతర సంబంధిత అధికారుల నుండి సైట్ మ్యాప్, పత్రాల ఆమోదంలో ఆలస్యం జరగడంతో సహా పలు కారణాలతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం