కలెక్టరమ్మా.. మీ చొరవ భేష్!

తెలంగాణ రాష్ట్రం నారాయణపేట్‌ జిల్లా కలెక్టర్‌ డి. హరిచందనను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు....

Published : 25 Jun 2020 02:40 IST

కలెక్టర్‌ హరిచందనకు కేంద్రమంత్రి ప్రశంస

హైదరాబాద్‌: తెలంగాణలోని నారాయణపేట్‌ జిల్లా కలెక్టర్‌ డి.హరిచందనను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు. మహిళల సౌకర్యార్థం మొబైల్‌ ‘షీ టాయిలెట్’ ఏర్పాటును ఆయన ప్రశంసించారు. ‘‘మహిళల కోసం బయోడైజెస్టర్  టాయ్‌లెట్ల ఏర్పాటులో కలెక్టర్‌ హరిచందన చొరవ ప్రశంసనీయం. ఈ గొప్ప ఆలోచన మహిళలకు సౌకర్యవంతమైనదే గాక భద్రతనూ కల్పిస్తోంది. అలాగే ఇవి బయోడైజెస్టర్‌ మరుగుదొడ్లు కావడం వల్ల స్థిరత్వం ఉంటుంది’’ అని ట్విటర్లో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కోస్గి పురపాలికలో వీటిని ఏర్పాటు చేశారు. ఇందుకోసం వినియోగంలో లేని ఆర్టీసీ బస్సును మొబైల్ టాయిలెట్‌గా తీర్చిదిద్దారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే మహిళలు ఇబ్బందుల పడకుండా వీటిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని