సీఎం సమీక్ష: ఆరు సాగునీటి ప్రాజెక్టులపై...

అక్టోబరులో అవుకు టన్నెల్‌-2 ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. 

Published : 25 Jun 2020 15:55 IST

అమరావతి: అక్టోబరులో అవుకు టన్నెల్‌-2 ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభించనున్న ఆరు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అవుకు టన్నెల్‌-2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వెలుగొండ టన్నెల్‌-1లో ఇంకా 700 మీటర్లు తవ్వాల్సి ఉందని చెప్పారు. వచ్చే అక్టోబరు నాటికి టన్నెల్‌-1 ద్వారా నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. నెల్లూరులోని సంగం ప్రాజెక్టు ద్వారా అక్టోబరు నాటికి సాగునీటిని విడుదల చేయాలని జగన్‌ తెలిపారు.

వంశధార-నాగావళి లింక్‌ ద్వారా డిసెంబర్‌లో నీటి విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. వర్షపు నీరు వచ్చే సమయంలోనూ చేసుకోదగ్గ పనులను చేసుకోవాలని సూచించారు. నవంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లో గేట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పనులు ప్రణాళికాబద్ధంగా సాగకపోతే షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. దీంతోపాటు పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూ.3,791 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి రీఎంబర్స్‌ పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని