మీ కన్నవారు ఎంత బాధపడతారో ఆలోచించండి
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీసు శాఖ యువతను ఉద్దేశించి ట్విటర్లో ఓ వీడియోను విడుదల చేసింది. మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని కోరింది. దాంతో పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమ ప్రచారంలో భాగంగా నిర్వహించిన వెబినార్లో ప్రముఖ కథానాయకుడు
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా..
అమరావతి: మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీసు శాఖ యువతను ఉద్దేశించి ట్విటర్లో ఓ వీడియోను విడుదల చేసింది. మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని కోరింది. దాంతో పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమ ప్రచారంలో భాగంగా నిర్వహించిన వెబినార్లో ప్రముఖ కథానాయకుడు చిరంజీవి పాల్గొన్నారు. అలాగే మాదకద్రవ్యాలకు అలవాటు పడొద్దంటూ కథానాయకులు నాని, సాయి ధరమ్తేజ్.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడిన వీడియోలను ఏపీ పోలీస్ శాఖ ట్విటర్లో పెట్టింది.
‘‘ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్కు బానిసై బంగారంలాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటోంది. ఎన్నో జన్మల పుణ్యఫలం మనిషి జన్మ. ఇంత అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్థవ్యస్థం చేసుకోవడం అవసరమా? క్షణికానందం కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో యువత డ్రగ్స్కు బానిస కావడం చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు. ఎంతో అందమైన ఈ మనిషి జన్మకు ఒక లక్ష్యమంటూ ఉండాలి. అది సాధించడానికి నిరంతరం తపన పడుతూ ఉండాలి. అంతేగానీ జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. జీవితాల్ని చిత్తు చేసే ఈ మత్తు మనకు అవసరమా? మనిషిపై ఆధారపడే కుటుంబం వీధిన పడటం సమంజసమా? ఇకనైనా కళ్లు తెరిచి నవ ప్రపంచంవైపు యువత కదలాలి. ఈ దురలవాట్లకు బానిసైపోతుంటే మిమ్మల్ని చూసి మీ కన్నవారు ఎంత మనో వేదనకు గురవుతారో ఒక్కసారి వారి కోణంలో ఆలోచించి చూడండి’’అంటూ చిరంజీవి వెబినార్లో మాట్లాడారు.
‘‘మీరు ఎదగాలని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అయితే మీరు ఎదగకుండా పాతాళంలోకి పడిపోతుంటే చూడాలని ఒకరు ఎదురుచూస్తుంటారు. అదే డ్రగ్స్. ఆ డ్రగ్స్వైపు మీరు వేసే ఒకేఒక్క తప్పటడుగు మీ చేతుల్లోని జీవితంపై ఉన్న నియంత్రణను మొత్తం లాగేసుకుంటుంది. కంట్రోలంతా దాని చేతుల్లోకి వెళ్లిపోతుంది. మిమ్మల్ని డ్రగ్స్కు బానిసలుగా చేసి మీ నుంచి డబ్బు సంపాదించాలనుకున్న మాఫియాలు, బ్లాక్మార్కెట్లు చాలానే ఉన్నాయి. అవన్నీ ఒకవైపు.. వాటన్నింటి నుంచి మిమ్మల్ని కాపాడాలని కష్టపడుతున్న వేలాది పోలీసులు ఒకవైపు. మీరేవైపు?వాళ్లు చీకటితో చేస్తున్న యుద్ధంలో మనం కూడా పాల్గొందాం. వారికి కొంచెం సాయం చేద్దాం. మీకేమైనా సమాచారం తెలిస్తే.. స్నేహితుల ద్వారా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ పేర్లు కూడా వారు బయటకు రానివ్వరు. లెట్స్ ఫైట్ దిస్.. లెట్స్ ఫైట్ టుగెదర్.. లెట్స్ ఫైట్ డార్క్నెస్. జైహింద్’’ - నేచురల్ స్టార్ నాని
‘‘కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం మీరు ఘనతలు సాధిస్తే చూడాలనుకుంటోంది. డ్రగ్స్ మీ మెదడును, శరీరాన్ని పాడుచేస్తుంది. బ్లాక్మార్కెట్, నేర ప్రపంచం డబ్బు సంపాదించడానికి మీలాంటి వారి కోసం ఎదురుచూస్తుంటాయి. ఒక్కసారి మీరు డ్రగ్స్కు అలవాటు పడితే వారి చేతిలో కీలుబొమ్మలవుతారు. స్వచ్ఛమైన మిమ్మల్ని నేర ప్రపంచంలోకి లాగుతారు. వీరి నుంచి మిమ్మలి.. సమాజాన్ని కాపాడటం కోసం వేలాది మంది పోలీసులు జీవితాల్ని పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. ఏ చిన్న సమాచారం ఇచ్చినా డ్రగ్స్ మాఫియాను అడ్డుకోవడానికి ఉపయోపడుతుంది. మీ గుర్తింపును పోలీసులు గోప్యంగా ఉంచుతారు. కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మాతో చేతులు కలపండి. లెట్ అస్ ఫైట్ డార్క్నెస్ టుగెదర్’’
- సాయిధరమ్ తేజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు