డైట్ అక్కర్లేదు.. ఇలా చేసి చూడండి!
లావు అయినా వాళ్లు.. అవుతున్నానేమో అని భయపడేవాళ్లు చెప్పే మాటలివి. సన్నబడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉబకాయం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా మంది శారీరక శ్రమ లేక, అడ్డు, అదుపు లేకుండా తినడం మూలంగా లావు అవుతున్నారు. చక్కగా వ్యయా
లావైపోతున్నా.. రేపటి నుంచి జిమ్కెళ్లి సన్నబడాలి..
డైటింగ్ చేయాలి లేకపోతే లావైపోయేలా ఉన్నా..
సన్నబడాలని ఎక్కువ తినట్లేదు.. కానీ ఆహారం చూడగానే ఆగలేకపోతున్నా..
ఏదైనా ఫిట్నెస్ సెంటర్లో శిక్షణ పొంది సన్నబడతా..
లావు అయినా వాళ్లు.. అవుతున్నానేమో అని భయపడేవాళ్లు చెప్పే మాటలివి. సన్నబడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా మంది శారీరక శ్రమ లేక, జంక్ ఫుడ్కు ప్రాధాన్యం ఇవ్వడం కారణంగా లావు అవుతున్నారు. చక్కగా వ్యాయామం చేసేవారు త్వరగానే సన్నబడతారు. కానీ వ్యాయామం చేసే అంత సమయం గానీ.. ఆసక్తి గానీ లేని వారి సంగతి? పోనీ.. డైటింగ్ చేయాలనుకున్నా అన్ని వేళలా దాన్ని పాటించలేని వారి సంగతి? ఇలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. వ్యాయామం.. డైట్ చేయకపోయినా.. రోజువారి ఆహారపు అలవాట్లలోనే కొద్ది మార్పులతో ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. అవేంటంటే...
వంటలో ఘాటు ఉండేలా చూడండి
రుచికరమైన భోజనం ఉంటే.. కడుపు నిండా లాగించేస్తాం. ఆహారప్రియులు ఒక ముద్ద ఎక్కువే తింటారు. దీంతో ఒంట్లో కొలస్ట్రాల్ పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. అలా అని నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు తినే ఆహారంలో కారం కాస్త ఎక్కవ వేయండి లేదా మిరియాలు వేయండి. మిరియాలు ఆహారాన్ని మరింత రుచికరంగా చేయడంతోపాటు.. ఆకలిని, ఒంట్లో కెలరీలను తగ్గిస్తుంది.
పొడవాటి గ్లాసుల్లో తాగండి
కూల్డ్రింగ్, ఇతర పానీయాలను వెడల్పాటి గ్లాసుల్లో కాకుండా పొడవాటి గ్లాసుల్లో తాగండి. దీంతో తక్కువ పరిమాణంలో పానీయం తీసుకున్నా ఎక్కువగా తాగిన ఫీలింగ్ కలుగుతుంది. వీలైతే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. దీని వల్ల పానీయం తగ్గి నీటి పరిమాణం పెరుగుతుంది. ఆరోగ్యానికి మంచింది.
పూదీన పానీయం తీసుకోండి
పూదీన వాసన, రుచి మనిషి బరువు తగ్గించడంలో దోహదపడతాయి. ఖాళీ సమయాల్లో జంక్ ఫుడ్, స్నాక్స్ తినకుండా పూదీన టీ, పూదీన రసం తాగడం అలవాటు చేసుకోండి. కుదరకపోతే.. పూదీన రుచి ఉంటే క్యాండీస్ తినండి.
చేతిని మార్చి తినండి
చాలామంది కుడి చేతితోనే తింటుంటారు. ఎడమచేతి వాటం ఉన్నవాళ్లు ఎడమ చేతితో తింటారు. తినే ఆహారంపై నియంత్రణ తెచ్చుకోవాలంటే చేతిని మార్చి తినండి. అంటే కుడి చేతితో తినేవాళ్లు ఎడమచేతితో స్పూన్ సహాయంతో తినండి. ఎడమచేతి వాటం వాళ్లు కూడా అలాగే చేయండి. దీని వల్ల ఆహారం తక్కువ తినడంతోపాటు.. ఏం తింటున్నామనే దానిపై స్పృహ ఉంటుంది.
చిన్న ప్లేట్లలో..
పెద్ద ప్లేట్లలో ఎక్కువ ఆహారం కూడా తక్కువగా కనిపిస్తుంది. వదిలేయకూడదని మొత్తం తినేస్తాం. అందుకని చిన్న ప్లేట్లలో ఆహారం పెట్టుకోండి. పౌష్టికాహార నిపుణులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఓ సర్వేలో 31శాతం మంది పెద్ద ప్లేట్లలో ఎంత పెట్టినా తినేశారట. అలాగే ప్లేట్లు రంగుల్లో ఉండేలా చూసుకుంటే ఆ రంగులు ఆహారంలో కలిసిపోయి ఎక్కువగా కనిపిస్తుందట. దీంతో ఎక్కువ తింటున్నామనుకొని తక్కువే తింటారట.
తినే ముందు మంచినీరు తాగండి
భోజనం చేసే ముందు వీలైనంత మంచినీరు తాగండి. దీనివల్ల ఆకలి కాస్త మందగిస్తుంది. నీటిలో కెలరీలు ఉండవు కనుక.. ఎంత తాగినా ఇబ్బంది ఉండదు.
మాంసం తగ్గించి.. కూరగాయలు తినండి
శరీరంలో కెలరీలు తగ్గించుకోవాలంటే భోజనంలో మాంసం బదులు.. ఎక్కువగా కూరగాయలు ఉండేలా చూసుకోండి. మాంసం బదులు పుట్టగొడుగులు తినండి.
పప్పుధాన్యాలకు ముందు పెరుగు
పప్పుధాన్యాలతో భోజనం చేస్తే రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతోంది. అది బరువు పెరుగుదలకు దారి తీస్తుంది. అలా అని వాటిని తినకుండా ఉండలేం. కాబట్టి వాటిని తినే పద్ధతి మార్చండి. పప్పుధాన్యాలు తినే ముందు పెరుగు తినండి. ఆ తర్వాత పప్పుధాన్యాలు తినండి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ