ఏపీ ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌

రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది.....

Updated : 02 Jul 2020 18:18 IST

అమరావతి: రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. గత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పదవిలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.రమేశ్‌కుమార్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీచేశారు. పి.రమేశ్‌కుమార్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. అలాగే, సమాచార కమిషనర్‌గా రేపాల శ్రీనివాసరావును నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని