200వ రోజుకి చేరిన అమరావతి ఆందోళన
రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఒకే రాష్ట్రం..
విజయవాడ: రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ ఆటోనగర్లోని ఐకాస కార్యాలయ వద్ద ఉద్యమంలో అమరులైన రైతులు, రైతు కూలీలకు నివాళులర్పిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమలో పలువురు ఐకాస నేతలు పాల్గొని రాజధాని పోరాటంలో మృతి చెందిన రైతులు, రైతు కూలీలకు నివాళులర్పించారు. రైతులకు మద్దతుగా మహిళలు కూడా దీక్షలు పాల్గొన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఉద్యమాలు ఆగిపోయి, జనజీవనం స్తంభించినా అమరావతి ఉద్యమం మాత్రం కొనసాగుతుందన్నారు. రైతులు ఎంతో పట్టుదలతో ఉద్యమం కొనసాగిస్తున్నార్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్రెడ్డి స్పందించి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని సూచించారు. రాజధాని రైతులకు 13 జిల్లాల ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని వివరించారు. సీపీఎం నేత బాబూరావు, వివిధ పార్టీల నేతలు దీక్షకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే