ప్రభుత్వ విప్‌ సునీత భర్తకూ కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా అందరినీ వణికిస్తోంది. తాజాగా నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Published : 04 Jul 2020 18:14 IST

నల్గొండ: తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా అందరినీ వణికిస్తోంది. తాజాగా నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన భార్య, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సునీతకు కరోనా సోకినట్టు వెల్లడైన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ నేపథ్యలో ఆమె భర్తకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే సునీత ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని