కనక దుర్గమ్మకు తెలంగాణ బోనం

ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనక దుర్గమ్మకు భక్తులు తెలంగాణ బోనం సమర్పించారు. మహంకాళి ఆలయం తరఫున పాతబస్తీ వాసులు బంగారు పాత్రలో ..

Published : 06 Jul 2020 01:38 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనక దుర్గమ్మకు భక్తులు తెలంగాణ బోనం సమర్పించారు. మహంకాళి ఆలయం తరఫున పాతబస్తీ వాసులు బంగారు పాత్రలో నైవేద్యం ఉంచి బోనం అందజేశారు. సప్త మాతృకలకు  సప్త బంగారు బోనాల సమర్పణలో భాగంగా దుర్గమ్మకు ఈ బోనాన్ని సమర్పించినట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే ఆలయంలోకి భక్తులను అనుమతించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో, భాగ్యనగర్‌ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని