నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన వృద్ధుడు
అది 1918 సంవత్సరం, అప్పుడు ఆయన వయస్సు నాలుగేళ్లు, స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నప్పటికీ, దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు...
దిల్లీ: అది 1918 సంవత్సరం. అప్పుడాయన వయసు నాలుగేళ్లు, స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నప్పటికీ దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాడని సమాచారం. ఇప్పుడాయన వయస్సు 106 సంవత్సరాలు. మళ్లీ 102 ఏళ్ల తర్వాత కరోనా రూపంలో మరో మహమ్మారిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితేనేం, ఏ మాత్రం భయపడలేదు. ఆయన మనోనిబ్బరం ముందు కరోనా కూడా ఓటమిపాలైంది.
దిల్లీ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు కరోనా వైరస్ సోకడంతో వారందరినీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (ఆర్జీఎస్ఎస్హెచ్)లో ఉంచి చికిత్స చేస్తున్నారు. తాజాగా ఆ కుటుంబంలో 106 ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంత పెద్ద వయస్సులోనూ ఆ వృద్ధుడు తన 70 ఏళ్ల వారికన్నా వేగంగా కరోనా బారి నుంచి కోలుకోవడం విశేషం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం 1918-19 మధ్య స్పానిష్ ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం ఈయన వైరస్ బారి నుంచి కోలుకోవడం పట్ల ఆస్పత్రి వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఆయన స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారో లేదో తెలియదు. దానికి సంబంధించిన సమాచారం ఏదీ మన వద్ద లేదు. అప్పట్లో దిల్లీలో కొన్ని ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. కానీ 106 ఏళ్ల వయస్సున్న వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడం ఎంతో గొప్ప విషయం’’ అని ఆర్జీఎస్ఎస్హెచ్ వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?