కొవిడ్-19పై కొబ్బరి నూనె పోరాడగలదా?
కొబ్బరి నూనె.. వేల సంవత్సరాలుగా భారతీయులు తమ జీవితంలో ఒక భాగం చేస్తున్న వస్తువు. దీపారాధన, వంట, ఆయుర్వేదం, శరీరానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి.......
కేరళీయుల కరోనా విజయ రహస్యం ఇదేనా?
ఇంటర్నెట్ డెస్క్: కొబ్బరి నూనె.. వేల సంవత్సరాలుగా భారతీయులు తమ జీవితంలో ఒక భాగం చేస్తున్న వస్తువు. దీపారాధన, వంట, ఆయుర్వేదం, శరీరానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి తప్పించుకొనేందుకు చాలామంది ఆయుర్వేద పద్ధతులను ఉపయోగిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కషాయాల వంటివి సేవిస్తున్నారు. మరి కొబ్బరి నూనె సైతం కొవిడ్-19పై పోరుకు ఉపయోగపడనుందా?
జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ (జాపి)లో ప్రచురించిన ఓ అధ్యయనం కొబ్బరి నూనెకు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయని పేర్కొంది. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్లకు వ్యతిరేకంగా పోరాడగలదని తెలిపింది. కొబ్బరి నూనెలోని యాంటీ మైక్రోబయాల్ ప్రక్రియ శరీరంలో రోగనిరోధక స్పందనకు కీలకమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ వ్యవస్థను చైతన్య పరుస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
మానవులు, జంతువుల్లో కొబ్బరి నూనె, దాని ఉత్పత్తులు ఇమ్యూనోమాడ్యులేటరీ ఏజెంట్లుగా అత్యంత సురక్షితమని, ప్రభావవంతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఐతే మానవులపై ట్రయల్స్ కొన్నే జరిగాయని తెలిపారు. ‘కొబ్బరి నూనెపై సమీక్షకు కొవిడ్-19 మాత్రమే కారణం కాదు. అయితే ఈ నూనెను ఎక్కువగా వినియోగించే కేరళీయులు కొవిడ్-19పై బాగా పోరాడగలుగుతున్నారు’ అని డాక్టర్ శశాంక్ జోషి ఉదహరించారు.
(నోట్: వైద్యులు, పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోకుండా కొబ్బరి నూనెను నేరుగా సేవించరాదు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.