ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో తమిళిసై భేటీ

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సమావేశమయ్యారు. దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కొవిడ్‌ చికిత్స, పడకలు, పరీక్షలు, బిల్లులు, ప్రజల ఫిర్యాదులపై

Published : 07 Jul 2020 11:32 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సమావేశమయ్యారు. దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కొవిడ్‌ చికిత్స, పడకలు, పరీక్షలు, బిల్లులు, ప్రజల ఫిర్యాదులపై గవర్నర్‌ సమీక్షిస్తున్నారు. గవర్నర్‌తో జరుగుతున్న సమావేశంలో కేర్‌ హాస్పటల్స్‌, కిమ్స్‌, బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి, సన్‌షైన్‌, కామినేని, విరించి, గ్లోబల్‌, అపోలో, మల్లారెడ్డి నారాయణ, యశోధ, కాంటినెంటల్‌ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు