ప్రజలందరి మనిషి.. వైఎస్ఆర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ రచించారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో...
రేపు ‘నాలో.. నాతో.. వైఎస్ఆర్’ పుస్తకావిష్కరణ
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి ‘నాలో.. నాతో.. వైఎస్ఆర్’ పుస్తకాన్ని రచించారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో సీఎం జగన్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరగనుంది. ఈ మేరకు ప్రతినిధులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహానేత గురించి ప్రజల నుంచి సమాచారం తెలుసుకున్నానని విజయలక్ష్మి పుస్తకం తొలి పలుకుల్లో తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ ఒక తండ్రిగా, భర్తగా ఎలా ఉండేవారో పుస్తకంలో వివరించారు. నిజ జీవితంలో వైఎస్ఆర్ వేర్వురు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో అందులో పొందుపరిచారు. ప్రతి అడుగు వెనుకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను పుస్తకంలో విశ్లేషించారు. ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును, ఇంట్లో వారి అవసరాలను అర్థం చేసుకున్నట్లే ప్రజలను కూడా కుటుంబసభ్యులుగా భావించి వారి అవసరాలను తీర్చిన విధానాన్ని వివరించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతిని కోరుకుని, అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికి మేలు చేయబట్టే తమ కుటుంబసభ్యుల్లా వైఎస్ఆర్ను ఆదరించారని ముందుమాటలో వైఎస్ విజయలక్ష్మి చెప్పారు. ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తమ వివాహం, ఆనాటి పరిస్థితులు, పేదల డాక్టర్గా వైఎస్ఆర్, రాజకీయాల్లోకి రంగ ప్రవేశం, నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తిశ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, మహా నేత మరణంతో ఎదురైన పెను సవాళ్లు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవరకు జరిగిన పరిణమాలను పొందుపరిచారు. మరణం లేని మహా నేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారని పేర్కొన్నారు. తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు స్పూర్తి ఇవ్వాలనే సత్సంకల్పంతో పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. ఈ పుస్తకం ఎమ్మెస్కో పబ్లికేషన్స్ ద్వారా లభ్యమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్