ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు అచ్చెన్నకు అనుమతి

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు

Updated : 08 Jul 2020 20:18 IST

అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. తనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే విచారణ చేపట్టిన్న ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. తాజాగా విజయవాడ, గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించే అంశంపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిచ్చింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై గత నెల 12న అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అచ్చెన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఏసీబీ కస్టడీలోనే ఉంటున్నారు.  ఈ మేరకు విజయవాడ జైలు సూపరింటెండెంట్‌కు హైకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.  అచ్చెన్న ఆరోగ్యంపై వారానికి రెండుసార్లు నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. అచ్చెన్నాయుడు లేవనెత్తిన అంశాలపై అదనపు కౌంటర్ వేయాలని ప్రతివాదులను కోర్టు ఆదేశించింది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని