రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే...
చిన్నపనికే అలసట. నాలుగు మెట్లు ఎక్కి దిగితే కండరాల నొప్పులు. జుట్టురాలిపోవడం, చర్మం నిగారింపు తగ్గిపోవడం
చిన్నపనికే అలసట. నాలుగు మెట్లు ఎక్కి దిగితే కండరాల నొప్పులు. జుట్టురాలిపోవడం, చర్మం నిగారింపు తగ్గిపోవడం....అంతెందుకు తరచూ జలుబు, జ్వరం, ఇతరత్రా అనారోగ్యాలు.. ఇబ్బంది పెడుతున్నాయా.? అయితే.. మీ ఒంట్లో విటమిన్ డి తగ్గిందేమో గమనించుకోండి. అసలెందుకు ఇది లోపిస్తుంది? దీన్నెలా భర్తీ చేసుకోవాలి వంటివన్నీ తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే..
ఎండలోకి వెళ్లినప్పుడు మన శరీరం సూర్యకిరణాల నుంచి విటమిన్-డిని సహజసిద్ధంగా తయారు చేసుకుంటుంది. మారిన జీవనశైలి కారణంగా కనీస ఎండ పొడ తగలకుండా... ఏసీ, చీకటి గదుల్లో గడిపేస్తున్నవారే ఎక్కువ. దాంతో చాలామందిలో ఇప్పుడు విటమిన్ డి లోపం కనిపిస్తోంది. వర్షాకాలం, శీతకాలంలో సూర్యరశ్మి తగ్గడం వల్లా కొందరిలో ఇది లోపిస్తుంది. శారీరీక శ్రమ తక్కువ చేసేవారిలోనూ ఇది లోపిస్తోంది. ఈ విటమిన్ సరైన మోతాదులో శరీరానికి అందినప్పుడే అందం, అరోగ్యం.
ఎందుకు అవసరం?
రోజూ కనీసం 400 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ డి మన శరీరానికి అవసరం. ఇది ప్రధానంగా సూర్యరశ్మి నుంచి అందుతుంది. దాంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఇది లభిస్తుంది. కొవ్వులో కరిగే ఈ విటమిన్. క్యాల్షియం, ఫాస్ఫరస్లను శరీరం గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండూ ఎముక నిర్మాణానికి కావాల్సిన అత్యావశ్యక మూలకాలు. అందుకే ఎముకలు, దంతాల అభివృద్ధికి ఈ విటమిన్ అవసరం. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. వాపులను తగ్గిస్తుందని కొన్ని ప్రయోగ పరిశోధనలు చెబుతున్నాయి. రోగకారక క్రిములతో పోరాడే టీ-కణాలు, రోగనిరోధక కణాల పనితీరును విటమిన్-డి మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను తగ్గిస్తుంది. బరువు నియంత్రణకు సాయపడుతుంది.
మాంసాహారం: కాలేయం, చేపలు
ఆకుకూరలు: తోటకూర, మునగాకు
చిరుధాన్యాలు: మొక్కజొన్న, రాగులు
పప్పులు: సోయా, రాజ్మా, బొబ్బర్లు
కూరగాయలు: బీన్స్, టమాట
పండ్లు: దానిమ్మ, రెజిన్స్, బొప్పాయి
సుగంధద్రవ్యాలు: లవంగాలు, యాలకులు
డి లోపిస్తే...
విటమిన్-డి లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. చిన్నారుల్లో రికెట్సతో పాటు, శ్వాసకోస సంబంధ సమస్యలూ ఎదురవుతాయి. పెద్దల్లో దగ్గు, జలుబు, కారణం లేకుండా వచ్చే ఒళ్లునొప్పులు వంటివీ కనిపిస్తాయి. మహిళల్లో ఆస్టియో పోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటితో పాటు మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భిణుల్లో లోపిస్తే మధుమేహం వంటి సమస్య ముప్పుతో పాటు పాపాయి తక్కువ బరువుతో పుట్టొచ్చు. ఎదుగుదలలో లోపాలు ఉండొచ్చు.
వేటి నుంచి లభిస్తుంది?
చేపలు, చేప నూనెలు (కాడ్ లివర్ ఆయిల్), గుడ్డుపచ్చసొన, చీజ్, కాలేయం, చికెన్, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, ఫార్టీఫైడ్ నూనెలు, చిరుధాన్యాలు, పప్పులు, సోయా, నువ్వుల నుంచి విటమిన్-డి అందుతుంది.
- డాక్టర్ జానకి శ్రీనాథ్, పోషకాహార నిపుణురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్