
అభివృద్ధి ఏమైనా నిలిచిపోయిందా: తలసాని
హైదరాబాద్: ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే సౌలభ్యం మనకు ఉందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్, కరోనా, సచివాలయం కూల్చివేత అంశాలపై మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ నిన్న ఫోన్లో మాట్లాడారని తలసాని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్లో సమీక్షలు జరపట్లేదా అని మంత్రి ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా నిలిచిపోయాయా? రాష్ట్ర గౌరవానికి తగినట్లు సచివాలయం ఉంటే తప్పా? భవిష్యత్లో ఇంకా చాలా మందికి కరోనా సోకుతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’అని తలసాని వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.