హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయండి:బాలకృష్ణ

కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సీఎం జగన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి లేఖ రాశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే

Updated : 13 Jul 2020 18:55 IST

ఏపీ సీఎం జగన్‌, రాష్ట్ర సీఎస్‌కు బాలకృష్ణ లేఖ

అనంతపురం: కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సీఎం జగన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి లేఖ రాశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత జిల్లా కేంద్రమైన అనంతపురం హిందూపురానికి 110 కిలో మీటర్ల దూరంలో ఉందని గుర్తు చేశారు. హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని మరో లేఖలో బాలకృష్ణ కోరారు. దీని కోసం సరిపడ భూమి అందుబాటులో ఉందని లేఖలో ప్రస్తావించారు. మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు రాయలసీమ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లేఖలో బాలకృష్ణ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని