నిను వీడి నేనుండలేను..ఒక్కటైన ఆవు-ఎద్దు!

కరోనా ప్రభావంతో తమిళనాడులోని మధురైలో విడిపోయిన ఓ ఆవు-ఎద్దు జంట తిరిగి ఒక్కటయ్యింది.

Published : 14 Jul 2020 18:10 IST

మధురై: కరోనా ప్రభావంతో తమిళనాడులోని మధురైలో విడిపోయిన ఓ ఆవు-ఎద్దు జంట తిరిగి ఒక్కటయ్యింది. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం చిన్న కుమారుడు జయప్రదీప్‌ కృషితో మూగజీవాల జంట మళ్లీ కలుసుకుంది. కరోనా వల్ల ఆర్థికంగా కుదేలైన ఓ రైతు తన వద్దనున్న ఆవును మరో గ్రామానికి చెందిన రైతుకు విక్రయించాడు. ఇంతవరకు కలిసి మెలిసి ఉన్న తమను విడదీయవద్దన్న రీతిలో స్థానిక ఓ ఆలయంలో ఉండే ఎద్దు.. ఆవును తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుంది. దాదాపు గంటసేపు వాహనాన్ని కదలనీయకుండా చేసింది. చివరికి వాహనం కదలడంతో దానివైపే పరుగులు తీసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పన్నీర్‌ సెల్వం చిన్నకుమారుడు జయప్రదీప్‌ ఆవును కొని స్థానిక పాలమేడు అంజమలై కమిటీకి అప్పగించారు. ఆవు,ఎద్దు మళ్లీ ఒక్కటవ్వడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని