‘పాన్ మసాలా’కోసం ఆరాటం, కొవిడ్ రోగి పరారి..!
ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతున్నా.. తమ జిహ్వ చాపల్యాన్ని మానుకోలేకపోతున్నారు కొందరు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ‘పాన్మసాలా’ కోసం ఏకంగా ఆసుపత్రి నుంచే తప్పించుకున్నాడు. పాన్షాప్కు వెళ్లి అటునుంచి అటే తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది.
ఆగ్రా: ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతున్నా.. తమ జిహ్వ చాపల్యాన్ని మానుకోలేకపోతున్నారు కొందరు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ‘పాన్మసాలా’ కోసం ఏకంగా ఆసుపత్రి నుంచే తప్పించుకున్నాడు. పాన్షాప్కు వెళ్లి అటునుంచి అటే తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది.
ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అధికారులు అతన్ని స్థానిక ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. అనంతరం కొవిడ్ రోగులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయితే, ఆ వ్యక్తికి పాన్ మసాలా తినడం అలవాటు ఉండడంతో ఆసుపత్రి ప్రాంగణంలో వెతికాడు. ఎక్కడా దొరక్కపోవడంతో ఆసుపత్రి నుంచి తప్పించుకొని కొంతదూరంలో ఉన్న పాన్షాపుకు వెళ్లాడు. పాన్ తిన్న తర్వత మరికొన్ని పాన్లను పార్శిల్ తీసుకొని జేబులో వేసుకున్నాడు. అనంతరం అక్కడ నుంచి తన స్నేహితుడి ఇంటికి చేరుకున్నాడు. ఈ సమయంలోనే ఆసుపత్రి సిబ్బంది అతనికోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చివరకు ఆ రోగి అతని స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు తిరిగి అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ స్నేహితుడి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అయితే, ఆ వ్యక్తికి వైరస్ సోకిందనే విషయం ఆ కుటుంబ సభ్యులకు తెలియదని అధికారులు వెల్లడించారు.
కేవలం పాన్మసాలా కోసమే ఆ వ్యక్తి బయటకు వెళ్లాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతని కదలికపై గట్టి నిఘా పెట్టామని, అతని మానసిక పరిస్థితిపై కూడా దృష్టి సారించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు