
అలనాటి అరుదైన ‘రాయదుర్గం’
రాయదుర్గం, న్యూస్టుడే: విజయనగర రాజుల కాలం నాటి భవన నిర్మాణశైలికి అద్దంపట్టే అరుదైన చిత్రం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన కొందరు వ్యక్తులు లండన్లోని బ్రిటిష్ లైబ్రరీలో ఆ వర్ణ చిత్రాన్ని గుర్తించి ఇక్కడి హెరిటేజ్ అసోసియేషన్ సభ్యులకు పంపారు. 16వ శతాబ్దంలో గిరిదుర్గంగా పేరొందిన రాయదుర్గం శత్రుదుర్భేద్యమైన కోటగా ఉండేది. కొండపై మాధవరాయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఇది ఉండేది. దీనికి ఇరువైపులా ఉన్న రెండు వాచ్ టవర్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, పురావస్తుశాఖ అధికారులు పురాతన కట్టడాల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని హెరిటేజ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి జి.శివకుమార్ విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.