పుణె నుంచి గంటలో హైదరాబాద్కు ఊపిరితిత్తుల తరలింపు
కరోనా ప్రభావంతో సాధారణ వైద్యానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ 560 కి.మీ. దూరం నుంచి గంటలో ఊపిరితిత్తులు తరలించి.
విజయవంతంగా శస్త్రచికిత్స
ఈనాడు, హైదరాబాద్: కరోనా ప్రభావంతో సాధారణ వైద్యానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ 560 కి.మీ. దూరం నుంచి గంటలో ఊపిరితిత్తులు తరలించి.. ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టిన ఉదంతమిది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్నారు. అవయవ మార్పిడి కోసం జీవన్దాన్ ఫౌండేషన్లో పేరు నమోదు చేసుకున్నారు. పుణెలో ఓ వ్యక్తి జీవన్మృతుడు(బ్రెయిన్డెడ్) కావడంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు బంధువులు ముందుకొచ్చారు. పరీక్షలో ఆయనకు కరోనా నెగెటివ్ రావడంతో తెలంగాణ జీవన్దాన్ ఫౌండేషన్ ఇన్ఛార్జి డాక్టర్ స్వర్ణలత నేతృత్వంలో ఊపిరితిత్తులు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. వాటిని భద్రపరచిన పెట్టెను ఆదివారం ప్రత్యేక విమానంలో బేగంపేటకు తరలించారు. అక్కడి నుంచి కిమ్స్కు ఊపిరితిత్తులు చేరాయి. వెంటనే వైద్యనిపుణులు వాటిని రోగికి అమర్చి ఊపిరిపోశారు. ఒక ప్రాణం నిలిపేందుకు 560 కి.మీ. దూరం నుంచి గంట వ్యవధిలో ఊపిరితిత్తులు చేరవేసినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. రెండు నగరాల ట్రాఫిక్ పోలీసులు, భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ అధికారులు సహకారం అందించారని పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్