Covid ‘వాసన’ పట్టేస్తుంది!
వాసన కోల్పోవడంతో ముడిపడిన కొవిడ్-19 వంటి రుగ్మతలను వేగంగా పసిగట్టేందుకు ఒక పరీక్ష విధానాన్ని బ్రిటన్లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయ
సులువైన పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు
దిల్లీ: వాసన కోల్పోవడంతో ముడిపడిన కొవిడ్-19 వంటి రుగ్మతలను వేగంగా పసిగట్టేందుకు ఒక పరీక్ష విధానాన్ని బ్రిటన్లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది క్యాప్సూల్ ఆధారిత వాసన పరీక్ష అని వారు తెలిపారు. విస్తృత జనాభాలో కొవిడ్ను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. కరోనా వైరస్తోపాటు పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి నాడీ సంబంధ వ్యాధులను ఈ వాసన పరీక్ష సాయంతో గుర్తించొచ్చు. అయితే ఇవి విస్తృతంగా అందుబాటులో లేవు. పైగా చాలా ఖరీదైనవి. సాధారణ ఆరోగ్యపరిరక్షణ కేంద్రాల్లో వీటిని నిర్వహించడానికి చాలా సమయం పడుతుంది.
ఈ సమస్యను అధిగమించడానికి క్వీన్ మేరీ వర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న వాసన పరీక్ష కిట్ను అభివృద్ధి చేశారు. ఇందులో రెండు పట్టీలు మధ్య సువాసనలు వెదజల్లే ఆరోమేటిక్ నూనెలతో కూడిన క్యాప్సూల్స్ను ఉంచారు. పరీక్షను నిర్వహించడానికి ఈ క్యాప్సూల్స్ను రెండు వేళ్లతో గట్టిగా వత్తి, పట్టీలను తొలగించాలి. దీంతో క్యాప్సూల్స్లోని సువాసన బయటకు విడుదలవుతుంది. వీటిని గుర్తించడంలో సదరు వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి అతడికి ఒక స్కోరు లభిస్తుంది. దాని ఆధారంగా అతడిలో వాసన చూసే సామర్థ్యం తగ్గిందా అన్నది వైద్యుడు గుర్తిస్తాడు. ఈ విధానం కోసం స్వాబ్ పరీక్షల తరహాలో శరీరంలోకి ఎలాంటి సాధనాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు. పరీక్షార్థిపై ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్