TS News: ఈటల విమానంలో సాంకేతిక లోపం

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌తో పాటు మరికొంతమంది నేతలు ప్రయాణిస్తున్న

Updated : 15 Jun 2021 13:27 IST

దిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో పాటు మరికొంతమంది నేతలు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. భాజపాలో చేరిక సందర్భంగా ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ తదితరులు దిల్లీ వెళ్లారు. ఈరోజు ఈటల బృందం తిరిగి హైదరాబాద్‌ బయల్దేరింది. ఈ క్రమంలో ఈటల బృందం సహా 184 మంది ప్రయాణికులతో ఉన్న విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలట్‌ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. దీంతో విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని