TS News: ఆసిఫాబాద్లో ఆదిమ మానవుల కాలం నాటి సున్నపు రాతి గుహ
ఆసిఫాబాద్ జిల్లా అటవీప్రాంతంలో గిరిజనులు అర్జునలొద్దిగా పిలుచుకునే ప్రాంతం ఆదిమ మానవుల కాలం
ఈనాడు, హైదరాబాద్: ఆసిఫాబాద్ జిల్లా అటవీప్రాంతంలో గిరిజనులు అర్జునలొద్దిగా పిలుచుకునే ప్రాంతం ఆదిమ మానవుల కాలం నాటిదని, పాతరాతియుగంలో ఇక్కడ మానవ సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు రాతి పనిముట్ల రూపంలో దొరికాయని చరిత్రకారుడు, పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాసన్ వెల్లడించారు. కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోకి వచ్చే అర్జునలొద్ది గుహ 1.25 లక్షల ఏళ్ల నుంచి 11 వేల ఏళ్ల మధ్య జరిగిన మార్పులతో ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘ప్రకృతి తొలచిన అందమైన గుహల్లో అర్జునలొద్ది ఒకటి. తిర్యాణి మండలం మేశ్రామ్గూడ పంచాయతీ పరిధిలో అటవీప్రాంతంలో ఉంది. జిల్లా అటవీ అధికారి ఎస్.శాంతారాం, ఎఫ్ఆర్ఓ తోడిశెట్టి ప్రణయ్ ప్రోత్సాహంతో గతవారం మా పరిశీలనలో ఈ గుహ చారిత్రక ప్రాధాన్యం వెలుగులోకి వచ్చింది.
భూగర్భ శాస్త్రవేత్తల సహాయంతో అధ్యయనం చేశాం. గుహ ఇరుగ్గా ఉండటంతో 30 మీటర్ల వరకే పాక్కుంటూ వెళ్లగలిగాం. 54 కోట్ల ఏళ్ల క్రితం భూమిలో సున్నపురాయిని భూగర్భజలంతో తొలచడంతో మొదలైన ఈ ప్రక్రియలో 1.25 లక్షల ఏళ్ల క్రితం ఈ గుహ ఏర్పడి ఉండొచ్చని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ చకిలం వేణుగోపాలరావు అభిప్రాయపడ్డారు. గుహపక్కనే జలధార ఉండటం వల్ల పాతరాతి యుగంలో మనుషులు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు’ అని శ్రీనివాసన్ వివరించారు. అటవీ, పర్యాటకశాఖలు ఈ గుహను పర్యాటక కేంద్రంగా, సాహస పర్యటనలో భాగంగా చేస్తే ప్రకృతి పర్యాటకం, చరిత్ర అధ్యయనానికి లాభం జరుగుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్