Sangam Dairy: సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దు: హైకోర్టు ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Updated : 01 Sep 2021 14:23 IST

అమరావతి: సంగం డెయిరీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్లను కొట్టివేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంలో గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ రిట్‌ అప్పీల్‌ను తిరస్కరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని