kathipudi-ongole highway: 5 జిల్లాల రోడ్డు...5 ఏళ్లుగా పనులు
అది కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి-216. ఇది రాష్ట్రంలోని అయిదు జిల్లాల్లో ఉన్న తీరప్రాంత పట్టణాలను
కత్తిపూడి-ఒంగోలు ఎన్హెచ్లో కనిపించని వేగం
2018కే పూర్తవాల్సి ఉన్నా... మరో ఏడాదైనా కష్టమే
అది కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి-216. ఇది రాష్ట్రంలోని అయిదు జిల్లాల్లో ఉన్న తీరప్రాంత పట్టణాలను కలుపుతూ వెళ్లే కీలక రోడ్డు. దీన్ని అభివృద్ధి చేసేందుకు అయిదేళ్ల కిందట నిధులు ఇచ్చారు. మూడేళ్ల కిందటే పనులు ముగిసి, వాహనదారులు సాఫీగా ప్రయాణించేందుకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో సిద్ధంకాలేదు. కొవిడ్ బూచిని చూపుతూ రెండేళ్లుగా పనుల్లో వేగం పెంచడంలేదు.
ఇవీ వివరాలు...
తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి నుంచి కాకినాడ, అమలాపురం, రాజోలు, నర్సాపురం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, బాపట్ల, చీరాల మీదుగా ఒంగోలు వరకు 374.5 కి.మీ. ఈ రహదారి వెళ్తుంది. చెన్నై-కోల్కతా జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా తీరప్రాంతాల మధ్య రాకపోకల కోసం 2015-16లో ఈ రోడ్డు ఉన్నతీకరణకు రూ.3,800 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.2,800 కోట్లతో 280 కి.మీ. పనులు చేశారు. రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ (మోర్త్) నేరుగా పర్యవేక్షిస్తున్నా, లక్ష్యం మేరకు జరగడం లేదు.
అయిదు ప్యాకేజీల్లో అధిక జాప్యం
మొత్తం పనులను 10 ప్యాకేజీల కింద చేస్తున్నారు. మొదటి ప్యాకేజీ నాలుగు వరుసలుగా, మిగిలినవన్నీ రెండు వరుసలుగా నిర్మిస్తున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు (ప్యాకేజీ-1) పూర్తయింది. కాకినాడ బైపాస్తోపాటు గురజానపల్లి వరకు (ప్యాకేజీ-2)లో 95% పనులు జరిగాయి. ఇందులో రెండు ఆర్వోబీలు పూర్తికావాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలోని ఈపురుపాలెం నుంచి ఒంగోలు వరకు (ప్యాకేజీ-10) గతంలోనే పూర్తి చేశారు.
* ఇక గురజానపల్లి-పాసర్లపూడి (ప్యాకేజీ-3)లో 71%, దిండి-దిగమర్రు-లోసరి (ప్యాకేజీ-6)లో 81%, లోసరి నుంచి మచిలీపట్నం శివారు మాచవరం వరకు (ప్యాకేజీ-7) పనుల్లో 88% జరిగాయి. అయితే వీటిలో రెండేళ్లుగా ప్రగతి కనిపించడం లేదు. కొన్నిచోట్ల కల్వర్టులు, వంతెనలు, అసంపూర్తి రహదారులను పూర్తిచేయడం లేదు. అధికారులు తాఖీదులు ఇస్తుండగా... కొవిడ్ కారణంగా పనులు చేయలేకపోతున్నామంటూ బదులొస్తోందని చెబుతున్నారు.
* మరో రెండు ప్యాకేజీల్లో భూసేకరణ సమస్య ఉంది. పాసర్లపూడి-దిండి(ప్యాకేజీ-5)లో నాలుగు కి.మీ., రేపల్లే-ఈపురపాలెం(ప్యాకేజీ-9)లో మూడు కి.మీ. మేర భూసేకరణ జరుగుతోంది.
* ఈ ఏడాది డిసెంబరు నాటికి మొత్తం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ... వచ్చే వేసవికి సిద్ధమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే గుత్తేదారులు స్పందిస్తున్న తీరు, భూసేకరణ సమస్యలను పరిశీలిస్తే... రహదారి మొత్తం 2022 చివరికి పూర్తయ్యే వీలుందని తెలుస్తోంది.- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ