Votes Counting: 19న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది.
ఈనాడు, అమరావతి: హైకోర్టు తీర్పు నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, లెక్కింపు ముగియగానే ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ గురువారం రాత్రి పొద్దుపోయాక వెలువడింది. పోటీ చేసిన అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. లెక్కింపు ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సమావేశం ఎజెండా ఇప్పటికే జిల్లా అధికారులకు చేరింది. గురువారం కోర్టు తీర్పు వెలువడే సమయానికి ఎస్ఈసీ నీలం సాహ్ని దిల్లీలో ఉన్నారు. తీర్పు రాగానే ఆమె హుటాహుటిన బయల్దేరి సాయంత్రానికి విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రంలో 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 8న పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలుండగా, వాటిలో 2,371 ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 81 చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నిక వాయిదాపడింది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా... వాటిలో 126 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. 8 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. 11 చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో వాయిదాపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు