TS News: డీజీపీ ఎదుట మావోయిస్టు శారదక్క లొంగుబాటు

మావోయిస్టు నేత బజ్జర సమ్మక్క అలియాస్‌ శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు.

Updated : 17 Sep 2021 12:38 IST

హైదరాబాద్‌: మావోయిస్టు నేత బజ్జర సమ్మక్క అలియాస్‌ శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా గంగారం. 1994లో పీపుల్స్‌ వార్‌ పార్టీకి ఆమె ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లారు. శారదక్క.. ఇటీవల కరోనాతో మృతిచెందిన హరిభూషణ్‌ భార్య. ఆమె లొంగుబాటుపై డీజీపీ మహేందర్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని