Fire Accident: కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీఎంఆర్‌ పవర్‌ ప్లాంట్‌లో

Updated : 25 Sep 2021 13:27 IST

సాంబమూర్తినగర్‌: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్రతీరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీఎంఆర్‌ మినీ పవర్‌ ప్లాంట్‌లో జరిగిన ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. వెల్గింగ్‌ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు అంటుకుని ప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అందుపు చేసేందుకు యత్నిస్తున్నారు. పవర్‌ప్లాంట్‌లోని సుమారు 70 శాతం నిర్మాణ సామగ్రి కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని