చాటింగ్‌ చేస్తుండగా అడ్డు వచ్చిన భర్త.. పళ్లు రాలగొట్టిన భార్య! 

చాటింగ్‌ చేస్తుండగా అడ్డు వచ్చిన భర్తపై ఆగ్రహం చెందిన ఓ మహిళ అతడి పళ్లు రాలగొట్టింది.

Updated : 26 Sep 2021 11:18 IST

చాటింగ్‌ చేస్తుండగా అడ్డు వచ్చిన భర్తపై ఆగ్రహం చెందిన ఓ మహిళ అతడి పళ్లు రాలగొట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా జిల్లా థియోగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. థియోగ్‌ సమీపంలోని చైలాచౌకీ ప్రాంతంలో నివసిస్తున్న అమిత్‌ కుమార్‌.. ఎప్పటిలాగానే ఆఫీసు పూర్తయ్యాక ఇంటికి వచ్చారు. ఇంట్లో భార్య చాటింగ్‌లో తీరికలేకుండా ఉండడం చూసి ఎవరితో చాట్‌ చేస్తున్నావ్‌? అని అడిగారు. చాటింగ్‌ మధ్యలో అడ్డువచ్చినందుకు భర్తపై ఆగ్రహం చెందిన ఆమె దాడికి దిగింది. అక్కడే ఉన్న ఓ కర్రతో చితకబాదింది. ఈ క్రమంలో అతని మూడు పళ్లు రాలిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని