ATM: పాత ఏటీఎం కొన్నాడు.. లక్షాధికారి అయ్యాడు..
జీవితం ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కోటీశ్వరులు ఒక్క రోజులో అన్నీ కోల్పోతే, అసలేమీ లేని వాళ్లు ధనికులైన సంఘటనలు ..
జీవితం ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కోటీశ్వరులు ఒక్క రోజులో అన్నీ కోల్పోతే, అసలేమీ లేని వాళ్లు ధనికులైన సంఘటనలు ఎన్నో! తాజాగా.. ఓ వ్యక్తి జీవితంలోనూ ఇదే జరిగింది. అతడు ఒక్కరోజులో లక్షాధికారి అయిపోయాడు. అందుకు కారణం ఓ ‘ఏటీఎం’. మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి 300డాలర్లు(రూ. 22,360) ఖర్చు పెట్టి జంక్యార్డు నుంచి ఓ ఏటీఎంను కొనుగోలు చేశాడు. అది అమ్మిన వ్యక్తి దానికి సంబంధించిన కీ ఇవ్వలేదు. దీంతో ఏటీఎంను కొనుగోలు చేసిన వ్యక్తి.. తన సహచరుడి సహాయంతో దాన్ని బద్దలుకొట్టాడు. అందులో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. మొత్తంగా 2వేల డాలర్లు(రూ. 1.5లక్షలు) బయటపడ్డాయి. అవి చూసి ఆ వ్యక్తి ఆనందంలో మునిగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వైరల్గా మారింది. వీక్షకులు వీడియోను విపరీతంగా లైక్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె