Work From Home: జీతం.. జీవితం.. సమతూకం: ఇంటి నుంచి పనికి మహిళల ఆసక్తి
కొవిడ్ అనంతర పరిణామాలు అనేక మార్పులను తీసుకొచ్చాయి. మహమ్మారి విజృంభణ తర్వాత జీవితకాలం ఒకేచోట ఉద్యోగం చేసే పరిస్థితులు తగ్గుతున్నాయి. కాంట్రాక్టు..
కొవిడ్ తర్వాత పెరిగిన అవకాశాలు
కంపెనీలకు చాలా వరకు ఖర్చు ఆదా
హైదరాబాద్ :కొవిడ్ అనంతర పరిణామాలు అనేక మార్పులను తీసుకొచ్చాయి. మహమ్మారి విజృంభణ తర్వాత జీవితకాలం ఒకేచోట ఉద్యోగం చేసే పరిస్థితులు తగ్గుతున్నాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, స్వతంత్ర ఉద్యోగాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇంటి నుంచి పని, వారానికి ఐదురోజుల పని, అనువైన పని గంటలు ఉన్న ఉద్యోగాలవైపు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. జీతంతో పాటు జీవితాన్నీ సమతూకం వేసుకుని పనిచేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన అనేక బహుళజాతి కంపెనీలు, కొన్ని అంకుర సంస్థలు ఇంటి నుంచి పనికి అవకాశాలు కల్పిస్తుండటంతో మహిళలు వాటిని అందిపుచ్చుకుంటున్నారు.
ఆన్లైన్ టీచింగ్
ఎల్కేజీ నుంచి పదోతరగతి వరకు ఆంగ్లం, సైన్స్, గణితం, సోషల్ సబ్జెక్టులకు ఆన్లైన్ టీచింగ్కు సంబంధించి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. నెలకు సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆర్జిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, వెర్బల్ నైపుణ్యాలు, ఇన్నోవేటివ్ టీచింగ్ నైపుణ్యాలుంటే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. తమకిచ్చిన సమయంలో లైవ్ తరగతులు నిర్వహించడంతో పాటు వెబినార్లు, వర్క్షాపులకు సమన్వయం చేయాలి. కొన్ని సంస్థలు క్యూ అండ్ ఏ నిపుణులుగానూ అవకాశాలు కల్పిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వచ్చే ప్రశ్నలకు యాప్లో సమాధానాలు చెప్పాలన్నమాట.
తాత్కాలికంగా ఇంటి నుంచి పని
కొన్ని బహుళజాతి కంపెనీలు కస్టమర్ కేర్ అసోసియేట్ వంటి ఉద్యోగాలకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. వీరంతా వినియోగదారుల నుంచి వచ్చే సందేహాలు నివృత్తి చేస్తూ, ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, వెర్బల్ స్కిల్స్, డాక్యుమెంటేషన్ వంటి అవకాశాలు లభిస్తున్నాయి. విశ్లేషణ సామర్థ్యం, కంప్యూటర్ వ్యవస్థ మీద కనీస అవగాహన ఉండాలి. ఇంట్లో ఉండే మహిళలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. చాట్ ప్రాసెస్, ఈమెయిల్ ప్రాసెస్ కోసం కంపెనీలే కంప్యూటర్, ఇతర కిట్లు అందిస్తున్నాయి.
ఇంటి నుంచి పనికే 46 శాతం మొగ్గు
• చాలామంది ఇంటి నుంచి పని వెసులుబాటు కల్పించే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని ‘ఇండీడ్’ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.
• ఉద్యోగార్థుల్లో 46 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాటికే ప్రాధాన్యం ఇస్తుండగా, పని చేస్తున్న వారిలో 51 శాతం మంది మహిళలు, 29 శాతం పురుషులు ఇంటి నుంచి పని విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.
• సీనియర్ మేనేజ్మెంట్లో ఉద్యోగుల్లో 52 శాతం మంది, మధ్యస్థ స్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారు 36 శాతం మంది, జూనియర్ స్థాయి ఉద్యోగాల్లో ఉన్న 31 శాతం మంది ఇదే విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.
భిన్నాభిప్రాయాలున్నాయి
ప్రస్తుతం హైదరాబాద్లో 89.9 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కనెక్టివిటీ పెరగడంతో చాలామంది అలాంటి ఉద్యోగాలే కావాలని కోరుకుంటున్నారు. కంపెనీలకు సైతం ఖర్చు తగ్గింది. సహాయ సిబ్బంది వేతనాలు, మౌలిక సదుపాయాల ఖర్చు తగ్గుతుంది. ఉదాహరణకు.. సైబర్ టవర్స్లో ఓ కార్యాలయంలో వర్క్ స్పేస్లో ఒకరికి రూ. 5,000 నుంచి రూ.15,000 వరకు ఖర్చవుతుంది. ఇంటి నుంచి పని వల్ల ఆ ఖర్చు తగ్గుతుంది. - సందీప్ మక్తాల, టీటా అధ్యక్షుడు
డిసెంబరులోగా మళ్లీ ఆఫీసులకు
ఐటీ రంగంలో చాలా కంపెనీలు ఇంటి నుంచి పనికి స్వస్తి పలకాలని ప్రయత్నిస్తున్నాయి. ముందుగా ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు, వైస్ ప్రెసిడెంట్లు తదితరులను ముందు కార్యాలయం నుంచి పని చేయాలని ఆదేశించాయి. అందరికీ టీకాలు వేయకపోవడంతో ఇది ఆలస్యమవుతోంది. డిసెంబరులోగా 60 శాతం మంది కార్యాలయాలకు హాజరుకావచ్చని అంచనా.- భరణి ఆరోల్, హైసియా అధ్యక్షుడు-
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!