Sajjanar: రూ. వంద చెల్లించి రోజంతా ప్రయాణించండి

పెట్రోలు ధర పెరిగిందని ఆందోళన వద్దని..  రూ.వంద చెల్లించి రోజంతా హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం ఒక

Updated : 03 Nov 2021 07:50 IST

- ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రోలు ధర పెరిగిందని ఆందోళన వద్దని..  రూ.వంద చెల్లించి రోజంతా హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీ-24 పేరిట 24 గంటలపాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కండక్టర్ల వద్ద టీ-24 టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ టికెట్‌తో  ఆర్డినరీ, సబర్బన్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో 24 గంటల వ్యవధిలో ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చన్నారు. విధుల్లో ఉండగా డ్రైవర్లు పాన్‌ మసాలాలు, గుట్కాలు తినకూడదని ఉత్తర్వులు జారీ చేసినట్లు మరో ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని