Toxic Positivity: అమితానందం కోసం ఆరాటమొద్దు
‘జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని’ అన్నట్టు... ప్రతి సందర్భంలోనూ సానుకూల దృక్పథంతో ఉండటం మంచిదే
దక్కకపోతే మిగిలేది విచారమే.. ఆస్ట్రేలియా పరిశోధకుల సూచన
సిడ్నీ: ‘జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని’ అన్నట్టు... ప్రతి సందర్భంలోనూ సానుకూల దృక్పథంతో ఉండటం మంచిదే! ఇలాంటివారు మిగతావారి కంటే ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని, ఎక్కువకాలం జీవిస్తారని చాలా పరిశోధనలు తేల్చాయి. అలాగని అతి సానుకూల భావన మాత్రం పనికిరాదంటున్నారు... ఆస్ట్రేలియాకు చెందిన ఫెడరేషన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు! ఆనందం కోసం తీవ్రంగా వెంపర్లాడేవారు ఆస్వాదించడాన్ని మర్చిపోయి, విచారగ్రస్థులు అవుతారని హెచ్చరిస్తున్నారు. దీన్ని వారు ‘టాక్సిక్ పాజిటివిటీ’గా పిలుస్తున్నారు. ‘అమితానందం కోరుకునేవారు అసలు దాన్ని పొందుతున్నారా?’ అన్న అంశంపై వారు అధ్యయనం సాగించారు. ఇందులో భాగంగా సుమారు 500 మందిని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ‘జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీ’ అందించింది.
పరిశోధకులు ఏం చెప్పారంటే..
😆 ‘ఒక్కటే జీవితం. బతికినంతకాలం ఆనందించాలి. అన్నీ ఆస్వాదించాలి’ అని భావించే చాలామందికి అది అందని ద్రాక్షే అవుతుంది. చాలా సందర్భాల్లో ఆశించింది వారికి దక్కదు. దక్కినా అనుకున్న స్థాయిలో ఉండదు. దీంతో వారి సంతృప్తి స్థాయులు పడిపోతాయి. కోరుకున్నది దొరకలేదన్న దిగులు చుట్టుముడుతుంది.
😆 తక్షణ ఆనందం (ఇన్స్టంట్ హ్యాపీనెస్) పంచే చర్యల కంటే, భవిష్యత్తులో తమ ఆనందాన్ని పెంచే ప్రవర్తనను అలవర్చుకున్న వారిలోనే ఆ సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. రోజువారి కార్యకలాపాలను సమర్థంగా నిర్వర్తించడం, క్లిష్టమైన పనులను పూర్తిచేసి, ఆ సంతృప్తిని ఆస్వాదించడం వంటివి మంచి మానసిక భావన కలిగిస్తాయి.
😆 ఆనందం అనేది నేరుగా దొరికేది కాదు. దానికి కారణమయ్యేవి ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలే. కాబట్టి వాటిపై దృష్టి పెట్టాలి.
😆 అమితానందం కోరుకునేవారు తరచూ ‘నేనేం సంతోషంగా లేను. నాలో ఏదో లోపముంది’ అని అంటుంటారు. అదే.. ‘ఎప్పటిపని అప్పుడు పూర్తిచేస్తాను. దాని వల్ల నా ఆనందం రెట్టింపు అవుతుంది’ అని భావించే వారే ఎక్కువ సంతోషంగా ఉంటారు.
😆 జీవితంలో దుఃఖం, వైఫల్యం, కష్టం, నష్టం, అసంతృప్తి అన్నవి ప్రతి ఒక్కరికి అత్యంత సర్వ సాధారణం. ఇవి తలెత్తినప్పుడు లక్ష్యానికి ఆటంకం కలిగిందని భావించకూడదు. ఇవి మామూలేనని సరిపెట్టుకుని, ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమైతేనే వాటి కారణంగా విచారం దరిచేరదు. పైగా జీవితం సానుకూలంగా, మరింత సంతృప్తిగా ఉంటుంది.
😆 ఒక్కటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి: నొప్పి ఎవరికైనా ఒక్కటే. బాధ పడతావా? లేదా? అన్నది మాత్రం నీ ఇష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ