AP News: ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. దారి మళ్లింపు  

నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు ప్రముఖులు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

Updated : 14 Dec 2021 17:07 IST

రేణిగుంట: నగరి ఎమ్మెల్యే రోజా, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడితో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో రాజమహేంద్రవరం- తిరుపతి ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. రేణిగుంటకు రావాల్సిన విమానం బెంగళూరుకు మళ్లించారు. విమానంలో రోజాతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రస్తుతం విమానం బెంగళూరులో సురక్షితంగా దిగినట్లు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. సాంకేతికలోపాన్ని సరిదిద్దేందుకు కావాల్సిన మెకానిజం రేణిగుంటలో లేనందునే బెంగళూరు తరలించారని వెల్లడించాయి. సమస్యను పరిష్కరించిన తర్వాత విమానం రేణిగుంట చేరుకోనున్నట్లు తెలిపాయి. 

మరోవైపు విమానం దారి మళ్లింపుపై రోజా స్పందించారు. తామింకా ఫ్లైట్‌లోనే ఉన్నామని.. డోర్స్‌ ఓపెన్‌ కావడం లేదని చెప్పారు. ఇంకా సూచనలు రావాల్సి ఉందని విమాన సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని