కిడ్నీ ఇస్తాను.. ఖర్చు భరించరూ: కుమారుడిని కాపాడాలని తల్లి వేడుకోలు
చికిత్స పొందుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు నాయబ్ రసూల్. ప్రస్తుతం రెండు కిడ్నీలు చెడిపోవడంతో అతని తల్లి తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కిడ్నీ మార్పిడికి దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని
చికిత్స పొందుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు నాయబ్ రసూల్. ప్రస్తుతం రెండు కిడ్నీలు చెడిపోవడంతో అతని తల్లి తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కిడ్నీ మార్పిడికి దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
నల్గొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన షేక్ మస్తాన్, మస్తాన్బీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకైన 14 ఏళ్ల రసూల్.. నిడమమనూరు మండలం వేంపాడు స్టేజీ వద్దనున్న మైనార్టీ గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటికి వచ్చిన పిల్లవాడు అనారోగ్యంతో మంచానపడ్డాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో వైద్యపరీక్షలు చేయించగా.. అతడి రెండు కిడ్నీలు పాడైనట్లు తేలింది. వెంటనే తెలిసిన వారి వద్ద సాయం ఆర్థించి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. అనంతరం వైద్యానికి డబ్బులు లేక నెలక్రితం నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యుల సూచన మేరకు వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయిస్తున్నారు. కొడుకు పరిస్థితిని కళ్లారా చూసిన తల్లి.. తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. ఇందుకోసం తగిన వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. కిడ్నీ మార్పిడి చేసేందుకు అవకాశం ఉందని, కానీ రూ.10 లక్షల మేర వైద్య ఖర్చులు అవుతాయని చెప్పడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం బాలుడికి డయాలసిస్ చేసే క్రమంలో ఆరోగ్యం పరిస్థితి విషమించిందని, ఎంతో భవిష్యత్తు ఉన్న రసూల్ను కాపాడాలని కుటుంబ సభ్యులు, బాలుడి తాత పఠాన్ మస్తాన్ కన్నీటిపర్యంతంతో అభ్యర్థిస్తున్నారు.
- హాలియా, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్