AP News: అమరావతి పరిరక్షణ సభ.. తెదేపా నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ తిరుపతి సమీపంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
తిరుపతి: అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ తిరుపతి సమీపంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సభ జరగనుంది. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించాయి.
మరోవైపు రైతుల సభ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తిరుపతి సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. తిరుపతిలోనూ పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. భాకరాపేట నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నారు. ఇతర ప్రాంతాల తెదేపా నేతలు తిరుపతి రాకుండా అడ్డుకుంటున్నారు. చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత కారును పోలీసులు సీజ్ చేయడంతో ఆమెతో పాటు పలువురు తెదేపా నేతలు బస్సులో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు వచ్చేవారిని పోలీసులు అడ్డుకోవడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
-
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
-
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
-
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!