Road Accident: ఏడు కార్లను ఢీకొట్టిన ఆర్మీ వాహనం

రాజీవ్‌ రహదారిపై రక్షణ శాఖకు చెందిన వాహనం ఏడు కార్లను ఢీకొట్టిన ఘటన శామీర్‌పేట ఠాణా

Updated : 19 Dec 2021 08:26 IST

శామీర్‌పేట, న్యూస్‌టుడే: రాజీవ్‌ రహదారిపై రక్షణ శాఖకు చెందిన వాహనం ఏడు కార్లను ఢీకొట్టిన ఘటన శామీర్‌పేట ఠాణా పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.  మేడ్చల్‌ జిల్లా తూంకుంట పుర పరిధి రాజీవ్‌ రహదారి అలంక్రిత రిసార్టు సమీపంలో నగరం వైపు నుంచి వస్తున్న ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఏడు కార్లను ఢీకొట్టింది. మూడు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. మరో నాలుగు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అరగంట పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని