TS News:డిస్కంల లోటు రూ.26,665 కోట్లు
‘విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం)ల ఆదాయ, వ్యయాల మధ్య అంతరం భారీగా పెరుగుతోంది. గత మూడేళ్లలో కరెంటు సరఫరాకు చేసిన
బడ్జెట్ కేటాయింపులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి
హైదరాబాద్: ‘విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం)ల ఆదాయ, వ్యయాల మధ్య అంతరం భారీగా పెరుగుతోంది. గత మూడేళ్లలో కరెంటు సరఫరాకు చేసిన వ్యయంతో పోలిస్తే ఆదాయం రూ.26,665 కోట్లు తక్కువగా వచ్చిందని తాజాగా డిస్కంలు నిర్ధారించాయి. ఈ లోటు పూడ్చుకునేందుకు నిధులివ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఒక ఆర్థిక సంవత్సరం పూర్తయిన తరవాత ఆదాయ, వ్యయాల మధ్య అంతరం ఎక్కువగా ఉంటే విద్యుత్ చట్టం ప్రకారం ఈ లోటు పూడ్చుకునేందుకు ‘ట్రూఅప్’ పేరుతో సర్ఛార్జీ వసూలుకు అనుమతించాలని డిస్కంలు ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి’(ఈఆర్సీ)కి ఏటా నవంబరు 30కల్లా ప్రతిపాదనలు ఇవ్వాలి. గత మూడేళ్లుగా ఈ ప్రతిపాదనలేమీ ఇవ్వలేదు. ఈ ఏడాది(2021-22) రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.10,500 కోట్లను విద్యుత్ రాయితీల కింద కేటాయించింది. అవి సరిపోకపోవడంతో మరో రూ.10,624 కోట్ల లోటు ఏర్పడనుందని తాజాగా డిస్కంలు నిర్ధారణకు వచ్చాయి. వీటితో కలిపి మూడేళ్ల(2019-22)లోటు రూ.26,665 కోట్లకు చేరనుందని తాజా అధ్యయనంలో గుర్తించాయి. వచ్చే ఏడాది మరో రూ.10,928 కోట్ల లోటు(ప్రభుత్వం ఇచ్చే రాయితీపోను) ఏర్పడుతుందని లెక్కించాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెంచాలని, లేనిపక్షంలో ఛార్జీల పెంపు అనివార్యమని డిస్కంలు తాజాగా ప్రభుత్వానికి తెలిపాయి. ఛార్జీలు పెంచడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని అడగగా, ఎంత పెంచాలనే దానిపై వర్గాల వారీగా లెక్కలు వేసి ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలపై ఎక్కువ భారం పడకుండా చూడాలని చెప్పినట్లు తెలిసింది.
తెలంగాణలో విద్యుత్తు నష్టం 21.54%
తెలంగాణలో విద్యుత్తు సరఫరా తాలూకూ సాంకేతిక, వాణిజ్య నష్టాలు యేటా పెరుగుతున్నట్టు కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కేసింగ్ తెలిపారు. 2015-16లో 14.01 శాతంగా ఉన్న నష్టాలు 2019-20 నాటికి 21.54 శాతానికి చేరినట్టు మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్