AP News: త్వరలో కారుణ్య నియామకాలు: ఆర్టీసీ ఎండీ

కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల వారసులకు త్వరలో కారుణ్య నియామకాలు

Published : 02 Jan 2022 08:55 IST

ఈనాడు, అమరావతి: కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల వారసులకు త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఆర్టీసీ హౌస్‌లో శనివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగం నుంచి వివిధ కారణాలతో వైదొలగిన వారికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన సూచించారు. కొత్త ఏడాదిలో సంస్థలో వ్యయాన్ని నియంత్రించి..ఆదాయం పెంచడంపై ఉద్యోగులు దృష్టి పెట్టాలన్నారు. పొరుగు రాష్ట్రాల రవాణా సంస్థలతో పోటీ పడి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఎండీ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు