Old currency: గురువాయూరు ఆలయ హుండీల్లో పాత నోట్లు
భక్తుల కానుకలతో కేరళలోని త్రిశ్శూర్ జిల్లా గురువాయూర్ ఆలయ హుండీలు కళకళలాడుతున్నాయి.
కేరళ: భక్తుల కానుకలతో కేరళలోని త్రిశ్శూర్ జిల్లా గురువాయూర్ ఆలయ హుండీలు కళకళలాడుతున్నాయి. అయితే ఇదే విషయంపై.. ఆలయ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. హుండీల్లో కానుకలు వేస్తే ఇబ్బందులు ఏం ఉంటాయనేగా మీ సందేహం? ఆ కానుకలు నోట్ల రూపంలో ఉండడం, ఆ నోట్లు రద్దు అయినవి కావడమే అసలు సమస్య! నోట్ల రద్దు తర్వాత.. పాత నోట్లు ఎక్కువగా హుండీల్లో దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లలో ఇలా హుండీల్లో పడిన రద్దైన నోట్ల విలువ.. రూ.1.35 కోట్లుగా ఉంది. ఈ నగదును ఏం చేయాలో నిర్వాహకులకు అర్థం కావడం లేదు. గత శనివారం ఒక్క రోజే.. 36 రూ.1000 నోట్లు, 57 రూ.500 నోట్లు (రద్దైనవి) హుండీలో లభించాయి. వీటికి ఎలాంటి విలువా లేదని తెలిసి నోట్లను భక్తులు హుండీల్లో వేసేస్తున్నారని అధికారులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు