రోడ్డు వేయాలనే ఆశయం నెరవేరకుండానే తండ్రి కన్నుమూత.. కుమారుడు శంకుస్థాపన
దీర్ఘకాలంగా గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ రోడ్డు నిర్మాణానికి ఓ వ్యక్తి ఎంతో కృషి చేశారు. కొన్ని ఇబ్బందులు ఎదురుకావడంతో ఆయన రోడ్డు నిర్మించలేకపోయారు. ఆయన ఆశయం నెరవేరకుండానే కన్నుమూశారు. ఈ
అధ్వానంగా రహదారి
కటక్, న్యూస్టుడే: దీర్ఘకాలంగా గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ రోడ్డు నిర్మాణానికి ఓ వ్యక్తి ఎంతో కృషి చేశారు. కొన్ని ఇబ్బందులు ఎదురుకావడంతో ఆయన రోడ్డు నిర్మించలేకపోయారు. ఆయన ఆశయం నెరవేరకుండానే కన్నుమూశారు. ఈ బాధ్యతను ఆయన కుమారుడు స్వీకరించారు. గ్రామస్థుల సహకారంతో రహదారి నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. బాలేశ్వర్ జిల్లా ఖైరీనగరీ గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. రహదారి నిర్మాణానికి నడుం కట్టిన కుమారుడు రత్నాకర్ దాస్ మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామం నుంచి బలియాపాల్ సమితిలోని బనియాడిహ పంచాయతీకి వెళ్లేందుకు కేవలం రెండు కిలోమీటర్లు దూరమని, బనియాడిహ పంచాయతీకి వెళ్లేందుకు సరైన రోడ్డు లేకపోవడంతో గ్రామస్థులు చుట్టూ తిరిగి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళుతున్నారని చెప్పారు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి స్థానిక యంత్రాంగం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, చివరికి తన నాన్న జలధరదాస్ యత్నించారన్నారు. స్నేహితుడు రామచంద్ర సేనాపతితో కలసి రహదారి నిర్మాణానికి కృషి చేశారని, భూసేకరణ, ఆర్థిక సమస్యల వల్ల సాధ్యం కాలేదన్నారు. అప్పట్లో తమ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉండేవని, దీంతో రోడ్డు నిర్మాణం జరగలేదన్నారు. ప్రస్తుతం తాను వ్యాపారంలో స్థిరపడ్డానని, తన నాన్న కలను సాకారం చేసి ప్రజలకు మేలు చేయాలని నడుం కట్టానన్నారు. జిల్లా యంత్రాంగంతో సంప్రదించి రోడ్డు నిర్మాణానికి అనుమతి పొందానని, సొంత డబ్బుతో నిర్మిస్తానని చెప్పారు.
రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్