AP PRC: నచ్చని పీఆర్సీకి రెండుసార్లు అభినందనలా?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ఆనందం కలిగించిందా?
ఆవేదనంతా వీడియోలు, చిత్రాలు, వ్యాఖ్యల్లో వ్యక్తీకరణ
ప్రభుత్వంలో కీలక వ్యక్తి, నలుగురు నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ఆనందం కలిగించిందా? ఆగ్రహం రగిలించిందా? అన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రతిబింబిస్తోంది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందేశాలనిండా పీఆర్సీ అంకంలో ప్రభుత్వం తరఫున కీలకంగా వ్యవహరించిన నాయకుడితో పాటు ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన నలుగురే లక్ష్యంగా కన్పిస్తున్నారు. కొన్ని పోస్టుల్లో ఆగ్రహావేశాలు శ్రుతి మించుతున్నాయి. ‘ఉన్నారా, విన్నారా’ అంటూ వ్యంగ్య బాణాలు విసురుతున్నారు. మీమ్లు, సినిమా క్లిప్పింగ్లను సందర్భానుసారంగా జోడిస్తున్నారు. ఆయా పాత్రలకు ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రభుత్వ పెద్దల పేర్లు పెడుతూ పోస్టులు వదులుతున్నారు. బాగా చక్కర్లు కొడుతున్న కొన్ని పోస్టులు ఇవీ.
ఈ చర్చలు సఫలమా?
* ‘సీపీఎస్ రద్దు లేదు, ఫిట్మెంట్ పెరుగుదల లేదు, అశుతోష్ మిశ్రా నివేదిక లేదు, పాత హెచ్ఆర్ఏ శ్లాబులు లేవు. చివర్లో చర్చలు సఫలం’ అంటూ ఆవేదనతో చిత్రం.
* నలుగురు నాయకుల ఫొటోలపై కొట్టివేత గుర్తుపెట్టి.. ‘చీకటి నాయకులు, చీకటి ఒప్పందాలు’ అంటూ కింద వ్యాఖ్య.
* ‘ఫ్యాప్టో అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ తగ్గేదేలే అంటిరి! మరి నేడు జేఏసీ నాయకుల చేతిలో ఫ్లవర్ (ఫ్యాప్టో) నలిగిపోయింది. ఇక ఫ్లవర్ చెవిలో పెట్టుకుని చెక్క భజన, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసుకోవడమే.’ ఇది ఉపాధ్యాయ సంఘాల్లో తిరుగుతున్న పోస్టు.
* ‘13 లక్షల మందిని నమ్మించి గొంతు కోసినందుకు బహుమతి ప్రకటించిన ప్రభుత్వం. సలహాదారులుగా ఆ నలుగురు నియామకం’, ‘మంత్రుల కమిటీ దెబ్బకు బోర్లా పడ్డ స్టీరింగ్ కమిటీ!’ ‘ఈ పీఆర్సీలో తేలిందేమిటంటే ఉన్నవి తీసేస్తే కొత్తవి అడగరు. తీసేసినవే ఇమ్మని అడుగుతారు’. ‘ఉద్యోగ సంఘాల నాయకుల చాకచక్యంతో ప్రభుత్వ టీం ఘనవిజయం సాధించింది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు.
కప్పు తెమ్మంటే చిప్ప తెచ్చారే?
* ‘విజయవాడలో ట్రైనింగ్ ఇచ్చి పంపాం కదా. కప్పు తెమ్మంటే చిప్ప తెచ్చారేంటి?’ అంటూ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖచిత్రంతో..
* ఓ మహిళ తన భర్తను కొడుతున్న వీడియో పోస్టు చేసి ‘ఎగరేసుకుని చలో విజయవాడ అంటూ ముందురోజే వెళ్లిపోయారు. ఏం సాధించారు? ఇంకోసారి ర్యాలీలు, మీటింగ్లు, గట్రా అంటే..’ అంటూ వ్యాఖ్యల జోడింపు.
* ‘బతకడానికి ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఏమన్నా సాధించుకురండిరా అంటే చచ్చాక మట్టి ఖర్చులు సాధించుకువచ్చారు మన..’ (అభ్యంతరకర పదం)
*‘ఆ ఒక్కరికి ఇప్పుడు మరో నలుగురు సలహాదారులు తయారయ్యారు’ అంటూ సచివాలయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఉద్యోగ సంఘాల నాయకుల ఫొటోతో.
*‘సుదీర్ఘ చర్చల అనంతరం చివరికి సాధించింది ఇదే!’ అంటూ ఓ చిప్ప ఫొటో.
*‘ఉద్యోగులకు నచ్చని పీఆర్సీ ఇచ్చి కూడా సంఘాల నేతలతో ఆయన రెండుసార్లు అభినందనలు చెప్పించుకున్నారు. సంఘాల నేతలు సీఎంను ఎప్పుడైనా కలిశారా అంటే అది అభినందనలు చెప్పేందుకే! తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్కారు ప్రతిపాదనలకు అంగీకరించామని చెబుతున్న నేతలు అన్నిసార్లూ అభినందనలు చెప్పాలా?’ అంటూ ప్రశ్నలు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.
బోత్ ఆర్ నాట్ సేమ్!
* బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ అఖండ చిత్ర ఫొటోతో పలు వ్యాఖ్యానాలు సామాజిక మాధ్యమ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.
* మేము అడిగింది ఫిట్మెంట్. మీరు చేస్తామంటున్నది సెటిల్మెంట్.
* మేము అడిగింది హౌస్ రెంటు. మీరు ఇస్తామంటుంది టెంట్హౌస్ రెంట్.
* మేము అడిగింది మిశ్రా రిపోర్టు. మీరు ఇచ్చింది సీఎస్ రిపోర్టు.
*మేము అడిగింది పీఆర్సీ. మీరు ఇస్తామంటున్నది రివర్స్ పీఆర్సీ.
*మేము అడిగింది సీపీఎస్ రద్దు. మీరు చేసింది చింతామణి రద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!