Hyderabad News: యూట్యూబర్‌ సరయూను విచారించిన పోలీసులు

యూట్యూబర్‌ సరయూతో ఆమె బృంద సభ్యులను బంజారాహిల్స్‌ పోలీసులు రెండోరోజు విచారించారు. ..

Published : 09 Feb 2022 07:25 IST

జూబ్లీహిల్స్‌: యూట్యూబర్‌ సరయూతో ఆమె బృంద సభ్యులను బంజారాహిల్స్‌ పోలీసులు రెండోరోజు విచారించారు. సినీనటి, యూట్యూబర్‌ వేమూరి నాగశ్వేత సరయూ(36), బృందం నిర్మించిన ఓ లఘుచిత్రం ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందని ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరయూ, లఘుచిత్ర దర్శక నిర్మాత బీరం శ్రీకాంత్‌రెడ్డి(36), జూనియర్‌ ఆర్టిస్టులు కృష్ణమోహన్‌ అలియాస్‌ సత్యకృష్ణ(27), గణపాక కార్తీక్‌(20)లను మంగళవారం బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శివచంద్ర విచారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని