Andhra News: అప్పుడే పుట్టిన శిశువును రైలు టాయిలెట్‌లో వదిలి వెళ్లిన మహిళ

విశాఖలో బొకారో ఎక్స్‌ప్రెస్ రైలులో గుర్తుతెలియన మహిళ ప్రసవించింది.

Updated : 11 May 2022 11:24 IST

విశాఖ: విశాఖలో ధన్‌బాద్‌- అలిప్పి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో నవజాత శిశువును వదిలేసిన ఘటన కలకలం చేసింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో గుర్తుతెలియని మహిళ ప్రసవించింది. బీ1 బోగీ టాయిలెట్‌ వాష్‌ బేసిన్‌లో మగశిశువును తల్లి విడిచి వెళ్లిపోయింది. ఏడుపు వినిపించడంతో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది శిశువును కాపాడారు. మెరుగైన వైద్యం కోసం రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువుకు వైద్యం అందిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువును ఎవరు విడిచి వెళ్లారు అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని