Harish Rao: బస్తీ ప్రజల సుస్తీ పొగొట్టేందుకు విప్లవాత్మక చర్యలు: హరీశ్రావు
బస్తీవాసులకు సేవ చేయాలని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
హైదరాబాద్ : బస్తీవాసులకు సేవ చేయాలని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నార్సింగిలో డయాగ్నోస్టిక్ హబ్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
‘బస్తీ ప్రజల సుస్తీ పోగేట్టేందుకు విప్లవాత్మక చర్యలు చేపడుతున్నాం. 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో ఏర్పాటు చేశాం. ఇక వైద్య పరీక్షల పేరున వేల రూపాయలను ప్రజలు పోగొట్టుకుంటున్నారు. అందుకే టి డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. దీని ద్వారా మెమోగ్రఫీ, 2డి ఎకో, ఎక్స్రే వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం టి డయాగ్నోస్టిక్స్లో 57 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో 134 రకాల సేవలకు విస్తరిస్తాం. హైదరాబాద్లో 20రేడియాలజీ ల్యాబ్లు అందుబాటులోకి తెస్తున్నాం. నూతనంగా అందుబాటులోకి వచ్చిన యాప్ ద్వారా దగ్గర్లోని బస్తీ దవాఖానాల చిరునామా, రేడియాలజీ ల్యాబ్ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. టెస్టుల వివరాలనూ ఈ యాప్లోనే పొందొచ్చు. ప్రభుత్వానికి సైతం ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. యాప్పై ప్రజలకు అవగాహన కల్పించాలి. నగరంలో నాలుగు సూపర్ స్పెషలిటీ ఆస్పత్రులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 3 అంచెల వైద్య వ్యవస్థ తెలంగాణలో అమలవుతోంది’ అని హరీశ్ రావు అన్నారు.
మందులు, పరీక్షల కోసం రోగులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండొద్దని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కిడ్నీ, లివర్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నామని వివరించారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.
వైద్యులను మందలించిన మంత్రి..
నార్సింగి యూపీహెచ్సీ వైద్యులను మంత్రి హరీశ్రావు మందలించారు. ఆరుగురు వైద్యులు సహా మొత్తం 32 మంది సిబ్బంది ఉన్నా రోగుల సంఖ్య తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ రిజిస్టర్ సరిగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ