Bharat Biotech: భద్రాద్రి ఆలయానికి భారత్‌ బయోటెక్‌ భారీ విరాళం..

భద్రాద్రి ఆలయానికి భారత్‌ బయోటెక్‌ కంపెనీ భారీ విరాళాన్ని ఇచ్చింది.

Published : 16 May 2022 13:52 IST

ఖమ్మం : భద్రాద్రి ఆలయానికి భారత్‌ బయోటెక్‌ కంపెనీ భారీ విరాళాన్ని ప్రకటించింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో నిత్యాన్నదానానికి రూ.కోటి విరాళాన్ని కంపెనీ యాజమాన్యం అందించింది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయంలో ప్రతిరోజు అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని అందిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్నదానం కోసం భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులు ఈ  కోటి రూపాయల విరాళాన్ని స్వామి వారి ఖాతాలో జమ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని